ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరాలు.. సుప్రీం కోర్టు సీరియస్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:03 IST)
సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన క్రిమినల్ కేసుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన క్రిమినల్ కేసుల వ్యవహారాన్ని ఏడాది లోపు తేల్చాలని పట్టుదలగా ఉన్న సుప్రీంకోర్టు.. ఇందులో తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
వీటిలో హైకోర్టులతో పాటు దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీకి కూడా పలు ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రభావం ఏపీలో సీఎం వైఎస్ జగన్‌పై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న సీబీఐ, ఈడీ కేసులపై కచ్చితంగా పడబోతోంది. 
 
సుప్రీం ఆదేశాల ప్రకారం ఆయా కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఛార్జిషీట్లు వేసేందుకు సీబీఐ, ఈడీ సిద్ధమవుతుండగా.. విచారణలు వేగవంతం చేయాలని సీబీఐ కోర్టుపైనా ఒత్తిడి పెరుగుతోంది. 
 
ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే నేరచరిత్ర కల నేతలను దూరంగా ఉంచాలని భావిస్తున్న సుప్రీంకోర్టు.. వీరికి వ్యతిరేకంగా దాఖలైన కేసుల్ని సాధ్యమైనంత త్వరగా తేల్చేయాలని పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments