కాశ్మీర్ అంతా ప్రశాంతమే... ప్రజల్ని భయపెట్టొద్దు : సత్యపాల్‌ మాలిక్‌

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (10:50 IST)
కాశ్మీర్‌ అంతా ప్రశాంతంగా ఉందనీ, ప్రజల్నీ భయపెట్టొద్దని జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కోరారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ, జమ్ముకాశ్మీర్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రతా కారణాల వల్లే రాష్ట్రంలో అదనపు బలగాలను మోహరించామని వివరించారు. 
 
ఊహాగానాలు, అసత్య వార్తలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఉగ్ర ముప్పుపై నిఘా వర్గాల సమాచారంతోనే అదనపు బలగాలను మోహరించామన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని సూచించారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
 
ఇదిలావుండగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి సాధారణంగానే ఉంది. లాల్‌ చౌక్‌లో ఏదైనా అనుకోనిది జరిగితే అంతా తెలిసిపోతుంది. కొన్ని రాజకీయ పార్టీలు అనవసర గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు. 
 
కేంద్రం ద్వారా నాకు తెలిసిన వివరాల ప్రకారమే నేను ప్రకటన చేశాను. అందరూ అనుకుంటున్నట్లుగా ఇక్కడేదో జరగబోతోందన్నది వాస్తవం కాదు. రేపు ఏం జరగబోతుందన్నది నాకు తెలియదు. అది నా చేతుల్లో లేదని తెలిపారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments