Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌మహల్‌లోని 22 గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవు

Webdunia
శనివారం, 14 మే 2022 (10:25 IST)
తాజ్‌మహల్‌లోని 22 గదులను శాశ్వతంగా మూసేశారని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి చర్యలు చేపట్టేలా ఏఎస్‌ఐ ఆదేశించాలని కోరుతూ అలహాబాద్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. 
 
ఈ నేపథ్యంలో.. తాజ్‌మహల్‌లోని గదులకు శాశ్వతంగా తాళాలు వేయలేదని, ఆ గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు తెలిపారు.
 
గదులకు మూడు నెలల కిందటే రిపేర్లు చేశామన్నారు. గోడలపై చిన్నచిన్న పగుళ్లను పూడ్చటంతోపాటు రీప్లాస్టరింగ్‌, కన్జర్వేషన్‌ పనులు జరిగాయని ఏఎస్‌ఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 
 
కాగా... దీనిపై ఏఎస్‌ఐ అధికారులు స్పందించారు. తాజ్‌మహల్‌ బేస్‌మెంట్‌లో ఉన్న గదులను ఇటీవలే తెరిచామని తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను పరిశీలించామని, తాజ్‌మహల్‌ గదుల్లో విగ్రహాలు ఉన్నట్టు ఎక్కడా ప్రస్తావన లేదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments