Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఓటు కావాలా? అయితే అలా చేయాల్సిందే.. ఓటర్ల వార్నింగ్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:12 IST)
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఓటర్లు కూడా డిమాండ్ చేయగలిగే రోజులు వచ్చేసాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరాక్షి జిల్లాకు చెందిన 68 గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయకుంటే తాము ఓట్లు వేయమని హెచ్చరించారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మోరీ‌పురేల ప్రాంతంలోని 68 గ్రామాలకు పవర్ గ్రిడ్ నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో మునిగిపోయాయి. దీంతోపాటు గ్రామాల్లో రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు లేవు. 'మంత్రిగాని లేదా ఎమ్మెల్యేగాని తమ గ్రామాలకు రావడం లేదు. వారు వచ్చినా అతిథి గృహాలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించడం లేదు. అందుకే మేం లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తాం' అని స్థానిక గ్రామస్థులు ప్రకటించారు.
 
తమకు కనీస వైద్యం అందడం లేదనీ, అనారోగ్యం పాలైతే తాము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే తాము ఈ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా పోలింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్థులు ముక్తకంఠంతో ప్రకటించారు. మరి వీరి ఓట్ల కోసం నాయకులు ఏం చేయనున్నారో చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments