మా ఓటు కావాలా? అయితే అలా చేయాల్సిందే.. ఓటర్ల వార్నింగ్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:12 IST)
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఓటర్లు కూడా డిమాండ్ చేయగలిగే రోజులు వచ్చేసాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరాక్షి జిల్లాకు చెందిన 68 గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయకుంటే తాము ఓట్లు వేయమని హెచ్చరించారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మోరీ‌పురేల ప్రాంతంలోని 68 గ్రామాలకు పవర్ గ్రిడ్ నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో మునిగిపోయాయి. దీంతోపాటు గ్రామాల్లో రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు లేవు. 'మంత్రిగాని లేదా ఎమ్మెల్యేగాని తమ గ్రామాలకు రావడం లేదు. వారు వచ్చినా అతిథి గృహాలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించడం లేదు. అందుకే మేం లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తాం' అని స్థానిక గ్రామస్థులు ప్రకటించారు.
 
తమకు కనీస వైద్యం అందడం లేదనీ, అనారోగ్యం పాలైతే తాము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే తాము ఈ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా పోలింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్థులు ముక్తకంఠంతో ప్రకటించారు. మరి వీరి ఓట్ల కోసం నాయకులు ఏం చేయనున్నారో చూద్దాం...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments