మూడు నెలలు నో కరెంట్ బిల్

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (06:37 IST)
మూడు నెలలు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ బారిన పడిన దేశాలలో ఇండియా కూడా ఉన్నది. ఇండియాలో మొత్తం 1071 మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 

కరోనా వలన వలస కూలీలు రోడ్డున పడ్డారు. రోడ్డున పడిన కూలీలకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక ఇప్పటికే చాలామంది ఇంటికే పరిమితం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కొంత డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

దీంతో పాటుగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అన్నీ రకాల లోన్లపై మూడు నెలల మారటోరియం విధించింది.  
 
అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరెంటు బిల్లు చెల్లింపులకు సంబంధించి అన్నీ రాష్ట్రాలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కరెంటు బిల్లుల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించాలని కోరింది.

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మూడు నెలల పాటు కరెంట్ బిల్లులపై మారటోరియం విధించాలని కేంద్రం పవర్ జనరేషన్ కంపెనీలను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments