భారీ మెజారిటీతో ఆ అవిశ్వాసం గెలుస్తుంది : శివసేన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజార్టీతో గెలుస్తుందని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక "సామ్నా"లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (10:06 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజార్టీతో గెలుస్తుందని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక "సామ్నా"లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలుగుదేశం పార్టీలపై కూడా విమర్శలు గుప్పించింది. 
 
మరో 25 యేళ్ల పాటు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎవరూ కదిలించలేరన్న భ్రమలను తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పటాపంచలు చేసిందని ఎన్డీయే కూటమిలో మరో కీలక భాగస్వామిగా ఉన్న శివసేన వ్యాఖ్యానించింది. ఎన్డీయే సర్కారుపై అపనమ్మకం ఏర్పడిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే యేడాది జరిగే ఎన్నికల్లో వారి నిరసన జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటాయని పేర్కొంది. 
 
ముఖ్యంగా, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరిగి ఓటింగ్ అంటూ జరిగితే భారీ మెజారిటీతో ఆ అవిశ్వాసం గెలుస్తుందని తన పత్రిక 'సామ్నా' సోమవారంనాటి సంపాదకీయంలో జోస్యం చెప్పింది. ఇదే సమయంలో టీడీపీ తన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమే అవిశ్వాసం ప్రతిపాదించిందని ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments