Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో దారుణం.. అంబులెన్స్ నిరాకరణ.. మహిళ మృతి

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (11:20 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. రోడ్డు బాగాలేదన్న కారణంతో అంబులెన్స్‌ను నిరాకరించింది. దీంతో ఆ మహిళను మంచంపై పడుకోబెట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాల్దా గ్రామానికి 25 యేళ్ల మాము అనే మహిళ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. తాజాగా ఆమె తీవ్ర అనారోగ్యంబారిన పడటంతో ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించి ప్రైవేటు అంబులెన్స్‌ యజమానులను సంప్రదించారు. 
 
అయితే, అ గ్రామానికి రోడ్డు బాగాలేదంటూ అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. దీంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు ఆమెను మంచంపై పడుకోబెట్టి ఆమెను మోసుకుంటూ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మొడికుపర రూరల్ ఆస్పత్రికి బయలుదేరారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments