Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో దారుణం.. అంబులెన్స్ నిరాకరణ.. మహిళ మృతి

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (11:20 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. రోడ్డు బాగాలేదన్న కారణంతో అంబులెన్స్‌ను నిరాకరించింది. దీంతో ఆ మహిళను మంచంపై పడుకోబెట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మాల్దా గ్రామానికి 25 యేళ్ల మాము అనే మహిళ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుంది. తాజాగా ఆమె తీవ్ర అనారోగ్యంబారిన పడటంతో ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించి ప్రైవేటు అంబులెన్స్‌ యజమానులను సంప్రదించారు. 
 
అయితే, అ గ్రామానికి రోడ్డు బాగాలేదంటూ అంబులెన్స్ పంపేందుకు నిరాకరించారు. దీంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు ఆమెను మంచంపై పడుకోబెట్టి ఆమెను మోసుకుంటూ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మొడికుపర రూరల్ ఆస్పత్రికి బయలుదేరారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

Varun jtej: చిరంజీవి కోణిదేల కుటుంబంలో నవజాత శిశువుకు స్వాగతం పలికిన మెగాస్టార్ చిరంజీవి

ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్‌ పిల్లలకు స్పూర్తి నింపిన బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments