Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాం సొమ్ము మనదే

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (09:10 IST)
పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా భారత్‌కు మరో భారీ విజయం దక్కింది. హైదరాబాద్‌ నిజాం సంపదపై హక్కుల విషయమై భారత్‌-పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఈ కేసులో బ్రిటన్‌ హైకోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

1948లో హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి కొద్ది రోజుల ముందు నిజాం ఆర్థిక మంత్రి బ్రిటన్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌ రహ్మతుల్లాకు 10 లక్షల పౌండ్లను పంపి జాగ్రత్తగా దాచాలని చెప్పారు. నిజాం చివరకు హైదరాబాద్‌ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేశారు. ఆ సొమ్ము ఎవరిదో న్యాయపరంగా తేలేవరకు ఖాతాను స్తంభింపజేస్తున్నట్లు అప్పట్లో స్థానికన్యాయస్థానం ప్రకటించింది.

నాటి 10 లక్షల పౌండ్లు వడ్డీతో కలిపి రూ.307 కోట్లయింది. నాట్‌వెస్ట్‌ బ్యాంకులో ఉన్న ఈ సొమ్ము తమదేనని పాకిస్థాన్‌ వాదిస్తుండగా, అది తమదేనని నిజాం వారసులు భారత్‌తో కలిసి న్యాయ పోరాటం చేస్తున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో బుధవారం బ్రిటన్‌ హైకోర్టు భారత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments