Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో కొలువు దీరిన నితీశ్ సర్కారు.. ఇద్దరు ఉపముఖ్యమంత్రులతో..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (20:58 IST)
Nitish kumar
బీహార్‌లో నితీశ్ కుమార్ సర్కారు కొలువు దీరింది. ఈ క్యాబినేట్‌లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, 12 మంతి మంత్రివర్గ సహచరులున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు మరి కొంతమంది బీజేపీ సీనియర్లు హాజరయ్యారు.
 
నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్జేడీ బహిష్కరించింది. బీహార్‌లో సుపరిపాలన కొనసాగుతుందని ప్రకటించారు నితీశ్. నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి.. పొలిటికల్ కెరీర్‌లో ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ పగూ చౌహాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
నితీశ్‌ కుమార్‌‌తో పాటు మరో 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు. బీహార్ బీజేఎల్పీ నేత తార్‌కిషోర్ ప్రసాద్, రేణుదేవి డిప్యూటీ సీఎంలుగా ఉంటారు. మరో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
బీజేపీకి మంత్రి పదవులు ఎక్కువగా దక్కనున్నాయి. బీహార్‌లో ప్రతిపక్షాల ఆటలు సాగవని.. అభివృద్ధి కొనసాగుతుందని బీజేపీ నేతలు తెలిపారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ మోడీ అసంతృప్తితో ఉన్నారన్న వ్యాఖ్యల్ని పార్టీ నేతలు ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments