Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో కొలువు దీరిన నితీశ్ సర్కారు.. ఇద్దరు ఉపముఖ్యమంత్రులతో..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (20:58 IST)
Nitish kumar
బీహార్‌లో నితీశ్ కుమార్ సర్కారు కొలువు దీరింది. ఈ క్యాబినేట్‌లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, 12 మంతి మంత్రివర్గ సహచరులున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు మరి కొంతమంది బీజేపీ సీనియర్లు హాజరయ్యారు.
 
నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్జేడీ బహిష్కరించింది. బీహార్‌లో సుపరిపాలన కొనసాగుతుందని ప్రకటించారు నితీశ్. నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి.. పొలిటికల్ కెరీర్‌లో ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ పగూ చౌహాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
నితీశ్‌ కుమార్‌‌తో పాటు మరో 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు. బీహార్ బీజేఎల్పీ నేత తార్‌కిషోర్ ప్రసాద్, రేణుదేవి డిప్యూటీ సీఎంలుగా ఉంటారు. మరో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
 
బీజేపీకి మంత్రి పదవులు ఎక్కువగా దక్కనున్నాయి. బీహార్‌లో ప్రతిపక్షాల ఆటలు సాగవని.. అభివృద్ధి కొనసాగుతుందని బీజేపీ నేతలు తెలిపారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ మోడీ అసంతృప్తితో ఉన్నారన్న వ్యాఖ్యల్ని పార్టీ నేతలు ఖండించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments