Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులు ఉరిశిక్ష తప్పించుకోవడానికే ఇదంతా చేస్తున్నారు..

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (11:09 IST)
నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు వేస్తున్న ఎత్తుగడలు అధికమవుతున్నాయని ఆశాదేవి తెలిపారు. ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు మార్చి3న ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వినయ్ తలను గోడకు కొట్టుకున్నాడు. దీంతో వీరి ఉరి అమలుపై మరోసారి సందిగ్ధత ఏర్పడింది. అయితే, తనకు వైద్య చికిత్స అందించాలంటూ వినయ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని పటియాలా కోర్టు కొట్టి వేసింది.
 
ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఉరి శిక్ష అమలును జాప్యం చేసేందుకు వేస్తున్న ఎత్తుగడలు ఇవని.. న్యాయస్థానాన్ని దోషులు తప్పుదోవ పట్టిస్తున్నారు. దోషులు ముందున్న అన్ని న్యాయపర అవకాశాలు ముగిశాయి. మార్చి 3న వారికి ఉరి శిక్ష పడుతుందని కాను నమ్ముతున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments