కేరళ రాష్ట్రంలో కలకలం రేపిన నిఫా వైరస్ - విద్యా సంస్థలకు సెలవు

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (11:16 IST)
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కలకలం రేపింది. దీంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవులు శనివారం వరకు పొడగించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేసిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఈ వైరస్ వెలుగు చూసిన ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా కోళికోడ్ జిల్లాలోని అంగన్వాడీలు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్లు, ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు గత రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అనవసర ప్రయాణాలు, సమావేశాలకు దూరంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోళికోడ్ కలెక్టర్ ప్రజలను కోరారు.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి ఒక బృందం కోళికోడ్ చేరుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆగస్టు 30న మరణించిన మొదటి వ్యక్తిని కాంటాక్ట్ అయిన హై-రిస్క్ కాంటాక్ట్ గ్రూప్‌లో ఉన్న వారందరి నమూనాలను తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 14 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వారి నమూనాలను కూడా తీసుకొని పరిశోధనశాలకు పంపుతామన్నారు. వైరస్ సోకిన 9 ఏళ్ల బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రాజా సాబ్ సాంగ్ రిలీజ్.. నిధి అగర్వాల్‌కు ఇక్కట్లు.. సుమోటోగా కేసు (video)

Sri Charan: వాయిస్‌తోనే సౌండ్స్‌ను ఇచ్చాను, అందరూ ఎంజాయ్ చేస్తారు : శ్రీ చరణ్ పాకాల

Aadi Saikumar: శంబాల చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది

సెట్‌లో కెమెరా లైట్స్, కెమెరాలు సరిగ్గా పని చేసేవి కావు : జిన్.. దర్శకుడు చిన్మయ్ రామ్

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హ్యాండ్ చూపిస్తూ కొత్త సినిమా ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments