Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలకు అర్థరాత్రి పూట చదువేంటి... అమ్మాయిలపై నిషేధం విధించిన పుణె కాలేజ్

అమ్మాయిలకు అర్థరాత్రి పూట చదువేంటి అంటూ... అమ్మాయిలపై నిషేధం విధించిందీ పూణెలోని ఓ కాలేజి. ఆ కాలేజీ పేరు బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల. ఈ కాలేజీలోని గ్రంథాలయం 24 గంటలూ తెరిచేవుంచుతారు.

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (11:12 IST)
అమ్మాయిలకు అర్థరాత్రి పూట చదువేంటి అంటూ... అమ్మాయిలపై నిషేధం విధించిందీ పూణెలోని ఓ కాలేజి. ఆ కాలేజీ పేరు బైరాంజీ జీజీబాయ్ ప్రభుత్వ వైద్య కళాశాల. ఈ కాలేజీలోని గ్రంథాలయం 24 గంటలూ తెరిచేవుంచుతారు. దీంతో పీజీ వైద్యలు, యువ రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్న్‌షిప్ చేసేవారు ఎప్పుడైనా వచ్చి చదువుకునే వెసులుబాటు ఉంది. 
 
రాత్రిళ్లు సైతం లైబ్రరీ సందడిగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అమ్మాయిలపై నిషేధం విధిస్తూ, రాత్రి 11:15 గంటలకెల్లా అందరు విద్యార్థినులనూ హాస్టళ్లకు పంపేస్తున్నారు. యూజీసీ నిబంధనల మేరకు ఆడ, మగ తేడా చూపుతూ ఎలాంటి ఉత్తర్వులను ఇచ్చే వీల్లేకున్నా, మహిళల స్వేచ్ఛను హరించేలా కాలేజీ డీన్ అజయ్ చందన్ వాల్ నిర్ణయం తీసుకున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
 
కాగా, ఈ లైబ్రరీకి అర్థరాత్రి 1:30 గంటల సమయంలో కూడా చదువు పేరిట అమ్మాయిలు హాస్టల్స్ నుంచి బయటకు వస్తున్నారనీ, ఇది వారికి క్షేమం కాదన్న ఉద్దేశంతోనే నిబంధనలు మార్చామని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం అమ్మాయిల భద్రత గురించి ఆందోళనతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని చందన్ వాలే చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments