Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

ఠాగూర్
మంగళవారం, 21 మే 2024 (11:56 IST)
గుజరాత్ రాష్ట్రంలో నవ వధువు కిడ్నాప్‌కు గురైంది. 15 మంది సాయుధ దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు. పెళ్లి ఊరేగింపును అడ్డగించి, కారులో ఉన్న వధువును కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని దహోద్ జిల్లాలో వెలుగు చూసింది. దీనిపై ఫిర్యాదు అందుకుని పోలీసులు... తక్షణం రంగంలోకి దిగి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం రాత్రి వివాహ అనంతరం వధూవరులను ఊరేగించారు. ఊరేగింపు నవగామ్‌కు చేరుకోగానే సాయుధులైన 15 మంది దుండగులు వధూవరులు ఉన్న కారును అడ్డుకున్నారు. ఆపై నవ వధువు ఉష (22)ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. 
 
ఆ వెంటనే వరుడు రోహిత్ అమలియార్ (23) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ సూత్రధారులంటూ ఐదుగురు పేర్లు చెప్పిన రోహిత్ మరో పది మంది కూడా కిడ్నాప్‌లో పాల్గొన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎనిమిది మంది నిందితులను గుర్తించి, ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
కిడ్నాప్ వ్యవహారంలో మహేశ్ భూరియాను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు దహోద్ డివిజన్ డీఎస్పీ జగదీశ్ సింగ్ భండారీ తెలిపారు. నవ వధువు ఉష, నిందితుల దూరపు బంధువులని పేర్కొన్నారు. మహేశ్ కజిన్ ఒకరు ఉష కుటుంబంలోని వ్యక్తిని పెళ్ళి చేసుకున్నారు. ఉషను కిడ్నాప్ చేసిన నిందితుడు మధ్యప్రదేశ్ వెళ్ళి ఉంటాడని అనుమానిస్తున్నారు. అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు. నిందితులకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments