Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

ఐవీఆర్
మంగళవారం, 21 మే 2024 (11:48 IST)
ఓ మహిళ కడుపులో 570 రాళ్లు వుండటం చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అంబేద్కర్ కోనసీన జిల్లా అమలాపురం లోని దేవగుప్తంకి చెందిన నరసవేణి అనే మహిళ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. సమస్య వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఎలాగో నొప్పిని భరిస్తూ వస్తోంది. ఐతే ఈ కడుపు నొప్పి మరింత తీవ్రమై తట్టుకోలేని స్థాయికి వెళ్లడంతో ఆమె అమలాపురంలోని ఏఎస్ఎ ఆసుపత్రికి వెళ్లి సమస్యను చెప్పింది. వైద్యులు పరీక్షించి ఆమె బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
 
వెంటనే ఆమెకి సర్జరీ చేయాలని నిర్ణయించారు వైద్యులు. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆమె కడుపులో వున్న రాళ్లను చూసి అంతా షాక్ తిన్నారు. రాళ్లు ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 570 రాళ్లు ఆమె కడుపు నుంచి బయటపడ్డాయి. సహజంగా ఇలాంటి కేసుల్లో పదుల సంఖ్యలో మాత్రమే రాళ్లు వుంటాయనీ, అలాంటిది ఆమె పొట్టలో వందల సంఖ్యలో రాళ్లు వుండటం ఆశ్చర్యానికి గురి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments