Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 29 నవంబరు 2024 (10:15 IST)
కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక.. రామనగరలోని దయానంద్ సాగర్ ఆసుపత్రి టాయిలెట్ పిట్‌లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. హరోహళ్లి తాలూకాలోని దేవరక్కగ్గలహళ్లి సమీపంలోని ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుందని, శిశువు పుట్టిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నంగా ఈ కేసును అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

బుధవారం ఎఫ్‌బ్లాక్ భవనంలోని కింది అంతస్తులోని రేడియాలజీ విభాగం సమీపంలోని మహిళల మరుగుదొడ్డిలో మూసుకుపోయి ఉండడాన్ని హౌస్‌కీపింగ్ సిబ్బంది గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పైప్‌లైన్ మరియు పిట్‌ను పరిశీలించిన సిబ్బంది లోపల శిశువు మృతదేహం ఇరుక్కుపోవడాన్ని గమనించారని పోలీసులు తెలిపారు.
 
వెంటనే ఆస్పత్రి పాలకవర్గం, పోలీసులకు సమాచారం అందించారు. రామనగర ఎస్పీ కార్తీక్‌రెడ్డితోపాటు పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.  
 
నిందితులను గుర్తించేందుకు హారోహళ్లి పోలీసులు డీఎన్‌ఏ పరీక్షను ప్రారంభించి ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్తీక్ రెడ్డి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments