Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 29 నవంబరు 2024 (10:15 IST)
కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక.. రామనగరలోని దయానంద్ సాగర్ ఆసుపత్రి టాయిలెట్ పిట్‌లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. హరోహళ్లి తాలూకాలోని దేవరక్కగ్గలహళ్లి సమీపంలోని ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుందని, శిశువు పుట్టిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నంగా ఈ కేసును అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

బుధవారం ఎఫ్‌బ్లాక్ భవనంలోని కింది అంతస్తులోని రేడియాలజీ విభాగం సమీపంలోని మహిళల మరుగుదొడ్డిలో మూసుకుపోయి ఉండడాన్ని హౌస్‌కీపింగ్ సిబ్బంది గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పైప్‌లైన్ మరియు పిట్‌ను పరిశీలించిన సిబ్బంది లోపల శిశువు మృతదేహం ఇరుక్కుపోవడాన్ని గమనించారని పోలీసులు తెలిపారు.
 
వెంటనే ఆస్పత్రి పాలకవర్గం, పోలీసులకు సమాచారం అందించారు. రామనగర ఎస్పీ కార్తీక్‌రెడ్డితోపాటు పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.  
 
నిందితులను గుర్తించేందుకు హారోహళ్లి పోలీసులు డీఎన్‌ఏ పరీక్షను ప్రారంభించి ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్తీక్ రెడ్డి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments