Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నలుగురు తోడేళ్ళను ప్రజలకు అప్పగించండి... జయాబచ్చన్

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (14:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న దిశ హత్య ఘటనపై రాజ్యసభ సభ్యురాలు, అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దిశ హత్య ఘటన తనను కలచివేసింవదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
దిశపై దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను ఉపేక్షించకూడదని ఆమె డిమాండ్ చేశారు. నలుగురు నిందితుల వల్ల ప్రపంచంలో భారతీయులంతా తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
మహిళలపై దారుణాలకు ఒడిగట్టితే అలాంటి వారికి ఇతర దేశాల్లో ప్రజలే తగిన శిక్ష వేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. దిశ హత్య కేసు ఘటనలో నిందితులను సైతం ప్రజలకే అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇతర దేశాల్లో ఎలాగైతే నిందితులను ప్రజలే శిక్షిస్తున్నారో అలాగే దిశ హత్య కేసు నిందితులను కూడా ప్రజలే శిక్షిస్తారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ఏం సమాధానం చెప్తోందని ఆమె నిలదీశారు. 
 
న్యూఢిల్లీలో నిర్భయ ఘటన, తెలంగాణలో దిశ ఘటన, ఇటీవలే కథువా ఘటన ఇలా వరుసపెట్టి మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని జయాబచ్చన్ సూటిగా ప్రశ్నించారు. 
 
దిశ ఘటన నిందితుల విషయంలో తాను కాస్త కఠినంగా రాజ్యసభలో మాట్లాడి ఉండొచ్చని కానీ అది తన ఆవేదన మాత్రమేనని జయాబచ్చన్ స్పష్టం చేశారు. నిందితులను ప్రజలకు అప్పగిస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా ఉంటాయని జయాబచ్చన్ అభిప్రాయపడ్డారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments