Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ లాయర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (16:50 IST)
ఢిల్లీలో సీనియర్ లాయర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు చేసింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే సోదాలు కొనసాగాయి. సీనియర్ లాయర్లు.. ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్ ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని వారు ఉల్లంఘించారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరిగాయి. ఆనంద్ గ్రోవర్, అతని ఎన్జీవో లాయర్లు విదేశాల నుంచి నిధులు సేకరించినట్టు కేసు నమోదైంది. 
 
మానవ హక్కుల గురించి పోరాడుతున్నందునే… తమను మోడీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఇందిరా జైసింగ్ ఆరోపించారు. ఈమె సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలు. మరోవైపు.. సీనియర్ లాయర్ల ఇళ్లపై సీబీఐ దాడులను విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ముక్తకంఠంతో ఖండించారు. ఇది బెదిరింపు చర్యేనని అభిప్రాయపడ్డారు. దాడులు సరికాదంటూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం ఎంపీలు.. ఈ లేఖపై సంతకాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments