Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న నెల్లూరు జిల్లాలో చేపల వేటపై నిషేధం.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (16:43 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఆ ప్రయోగ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటల సమయంలో జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ద్వారా చంద్రయాన్‌-2 రాకెట్‌ ప్రయోగం నిర్వహించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆ రోజు వేకువజాము ఒంటిగంట నుంచి 4 గంటల మధ్యలో మత్స్యకారులు ఎవరూ నిర్ణీత అపాయకర ప్రాంతమైన పులికాట్‌ లైట్‌హౌస్‌ నుంచి ఆర్మగాన్‌ లైట్‌హౌస్‌ వరకు చేపలవేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ విషయమై మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, తహసీల్దార్లు, వీఆర్‌వోలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ప్రమాదానికి గురికాకుండా పర్యవేక్షించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments