Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న నెల్లూరు జిల్లాలో చేపల వేటపై నిషేధం.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (16:43 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఆ ప్రయోగ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటల సమయంలో జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ద్వారా చంద్రయాన్‌-2 రాకెట్‌ ప్రయోగం నిర్వహించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆ రోజు వేకువజాము ఒంటిగంట నుంచి 4 గంటల మధ్యలో మత్స్యకారులు ఎవరూ నిర్ణీత అపాయకర ప్రాంతమైన పులికాట్‌ లైట్‌హౌస్‌ నుంచి ఆర్మగాన్‌ లైట్‌హౌస్‌ వరకు చేపలవేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ విషయమై మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, తహసీల్దార్లు, వీఆర్‌వోలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ప్రమాదానికి గురికాకుండా పర్యవేక్షించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments