Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలి: కేంద్ర న్యాయశాఖకు సీజేఐ లేఖ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (19:36 IST)
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాశారు. ఇటీవల అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలతో నిర్వహించిన రెండు రోజుల సదస్సు, నిర్ణయాలకు సంబంధించిన వివరాలతో ఆయన లేఖ రాశారు.

కరోనా కారణంగా డిజిటల్‌ పద్ధతితో కొనసాగుతున్న కోర్టుల పనితీరు మెరుగుకు నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని కోరారు. దేశంలో న్యాయస్థానాల సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని సూచించారు.

న్యాయవ్యవస్థలో ఉన్నవారిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలన్నారు. కొవిడ్‌ వల్ల నష్టపోయిన న్యాయవాదులు, జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు కొలీజియం సిఫారసులపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని జస్టిస్‌ ఎన్వీ రమణ లేఖలో విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments