Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ ఏమైనా దేవుడా.. ఆయన కోసం అంత హడావుడి ఎందుకు?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (13:18 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెలలో భారత పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటన ఈ నెల 24, 25 తేదీల్లో కొనసాగనుంది. ఆయన వెంట భార్య కూడా వస్తున్నారు. అయితే, ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా 70 లక్షల మందితో ఆయనకు స్వాగతం పలకనున్నట్లు వస్తున్న వార్తలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తమకు తోచిన రీతిలో సైటైర్లు వేస్తున్నారు. 
 
అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఇందులోనే నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో గుజరాత్ ప్రభుత్వం చేస్తోంది. 
 
అయితే, ట్రంప్‌కుక 70 లక్షల మంది జనాభాతో స్వాగతం పలుకనున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై నెటిజన్లు మండిపడుతూ సెటైర్లు వేస్తున్నారు.అహ్మాదాబాద్ జనాభానే 50 నుంచి 55 లక్షల మధ్య ఉంటే 70 లక్షల మంది ఎలాగొస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సభలా స్వాగతానికి కూడా జన సమీకరణ చేస్తారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 'నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్' కార్యక్రమం జరిగే మోతేరా స్టేడియం వరకు రోడ్డు షో ఏర్పాటు చేశారు. ఈ రోడ్డులో దాదాపు 70 లక్షల మంది జనం తనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారని వాషింగ్టన్‌లో ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
 
అంతమందితో స్వాగతం పలకడానికి ఆయనేమైనా దేవుడా? అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. ఒక దేశ అధ్యక్షుడి పర్యటనపై అంత హడావుడి దేనికని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై కూడా వారు మండిపడుతున్నారు. ట్రంప్ రాకపై చూపే శ్రద్ధ దేశంలో పేదరికం నిర్మూలనపై చూపాలని వారు హితవు పలుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments