Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయావతి ఆడా? మగా? లేక మరొకటా? బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (08:57 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. 
 
బీజేపీ పాలిత యూపీలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, మాయావతి ఆడా కాదు, మగా కాదంటూ వ్యాఖ్యానించారు. తనను ఘోరంగా అవమానించిన పార్టీతోనే ఇప్పుడామె చేతులు కలిపారన్నారు. 
 
1995లో లక్నో గెస్ట్‌హౌస్‌లో తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి మరీ ఇప్పుడామె వారితో చేతులు కలిపారని ఆరోపించారు. సాధనా సింగ్ వ్యాఖ్యలపై బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా స్పందించారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో బీజేపీ నేతలు మతి స్థిమితం కోల్పోయారని విమర్శించారు. 
 
వారిని తక్షణం ఆగ్రా, బరేలీలోని మానసిక వైద్య శాలలో చేర్చాలని సూచించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎస్పీ-బీఎస్పీ కూటమితో బీజేపీలో వణుకు మొదలైందన్నారు.
 
కాగా, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న ఎస్పీ - బీఎస్పీలు చేతులు కలిపిన విషయం తెల్సిందే. ఈ రెండు పార్టీలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తలా 38 సీట్లలో పోటీ చేయనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments