Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెహ్రూ రాసిన లేఖలు తిరిగి అప్పగించాలి : రాహుల్‌కు పీఎంఎంఎల్ లేఖ

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (12:22 IST)
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ప్రధానమంత్రి సంగ్రహాలయ - పీఎంఎంఎల్) లేఖ రాసింది. ఈ లేఖలను గత 2008లో పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తీసుకున్నారని, తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని కోరింది.  
 
చరిత్రక ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ లేఖలను జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. అయితే 2008లో 51 బాక్సుల్లో ప్యాక్ చేసిన వాటిని సోనియాగాంధీకి పంపారు. అప్పటి నుంచి అవి ఆమె వద్దే ఉన్నాయి. వాటిని తిరిగి అప్పగించాలని సెప్టెంబరులోనే పీఎంఎంఎల్ కోరింది. మరోసారి రాహుల్‌కు డిసెంబరు 10వ తేదీన అదేతరహా అభ్యర్ధన చేసింది. కనీసం ఫొటో కాపీస్ లేక డిజిటల్ కాపీస్ అయినా అందించాలని అడిగింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటెన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయ లక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయి. జాతి నిర్మాణంలో కీలకభూమిక పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో ప్రధాని సంగ్రహాలయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments