Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీట్' నిర్వహించాల్సిందే.. కేంద్రం పిటీషన్ తిరస్కృతి : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (16:24 IST)
దేశంలోని వైద్య కాలేజీల్లో ప్రవేశానికి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్)ను నిర్వహించాల్సిందేనంటూ గురువారం ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు ఉండబోదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆదేశాలు జారీ చేశాక పాటించి తీరాల్సిందేనంటూ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 
 
నీట్ పరీక్షతో పాటు.. ప్రీమెడికల్ ఎంట్రెన్స్ (ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం) పరీక్షను నిర్వహించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలని, నీట్ పరీక్షను నిర్వహించాలని కోరుతూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ పిటీషన్‌ను దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించకుండానే తోసిపుచ్చిన కోర్టు... ప్ర‌క‌టించిన షెడ్యూల్‌ మేర‌కే నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ ఎంట్ర‌ెన్స్ టెస్ట్ (నీట్‌)ను నిర్వ‌హించాల‌ని తేల్చి చెప్పింది. 
 
అయితే, గురువారం జారీచేసిన ఉత్త‌ర్వుల్లో సవరణలు కోరుకుంటే ద‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయాల‌ని సూచించింది. స‌వ‌ర‌ణ‌లు కోరితే వాటిపై విచారణ చేపడతామని తెలిపింది. ఇప్పటికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కార‌మే నీట్‌ను మే1, జులై 24న నీట్ ప‌రీక్ష‌ను నిర్వహించాల‌ని ఆదేశించింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments