Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూరులో నీట్‌కు మరో విద్యార్థిని బలవన్మరణం

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (13:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో నీట్ పరీక్ష మరో విద్యార్థి ప్రాణాలు తీసింది. ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. దీంతో ఓ విద్యార్థి ఉత్తీర్ణతపై భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
కోయంబత్తూరు జిల్లా పుదూర్‌కుప్పంకు చెందిన కుప్పుస్వామి-వలర్మతి దంపతుల కుమారుడు కీర్తివాసన్‌ (20) ప్లస్‌ టూ ముగించి రెండుసార్లు నీట్‌ రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో గత సెప్టెంబరులో జరిగిన నీట్‌కు కూడా హాజరయ్యాడు. 
 
అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న కీర్తివాసన్‌.. మరికొద్ది రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగాడు. ఆతర్వాత తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. 
 
తల్లి ఇంటికి చేరుకుని చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కుతూ కీర్తివాసన్‌ కనిపించాడు. దీంతో అతడిని తొలుత పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి కోయంబత్తూరు తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments