Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూరులో నీట్‌కు మరో విద్యార్థిని బలవన్మరణం

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (13:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో నీట్ పరీక్ష మరో విద్యార్థి ప్రాణాలు తీసింది. ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. దీంతో ఓ విద్యార్థి ఉత్తీర్ణతపై భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
కోయంబత్తూరు జిల్లా పుదూర్‌కుప్పంకు చెందిన కుప్పుస్వామి-వలర్మతి దంపతుల కుమారుడు కీర్తివాసన్‌ (20) ప్లస్‌ టూ ముగించి రెండుసార్లు నీట్‌ రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో గత సెప్టెంబరులో జరిగిన నీట్‌కు కూడా హాజరయ్యాడు. 
 
అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న కీర్తివాసన్‌.. మరికొద్ది రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగాడు. ఆతర్వాత తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. 
 
తల్లి ఇంటికి చేరుకుని చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కుతూ కీర్తివాసన్‌ కనిపించాడు. దీంతో అతడిని తొలుత పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి కోయంబత్తూరు తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments