Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృణమూల్ కాంగ్రెస్ శిబిరం‌లో అలారం మోగించడం ఖాయం.. ఓవైసీ

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (16:07 IST)
బీహార్‌లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఊపుమీదున్న ఎంఐఎం.. పశ్చిమ బెంగాల్‌లో కూడా పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ శిబిరంలో అలారం మోగించడం ఖాయమని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తామని ఒవైసీ ప్రకటించారు.
 
పశ్చిమ బెంగాల్ ఎంఐఎం నాయకులతో త్వరలో సమావేశమై చర్చిస్తానని, వారు తమ సంసిద్ధతను, విశ్వాసాన్ని చూపిస్తే.. తదుపరి పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో పోటీ చేయడంపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 'ఓటు కటువా'కు సమాధానమిచ్చిన ఓవైసీ.. మీ లోక్‌సభ నియోజకవర్గం బెర్హంపూర్‌లో ఎంత అభివృద్ధి పనులు చేశారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఆదిర్ రంజన్ చౌదరిని మందలించారు. 
 
తన లోక్‌సభ నియోజకవర్గంలో ముస్లిం సమాజం కోసం చేసిన అభివృద్ధి పనులపై చౌదరిని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ముస్లింల పరిస్థితి ఎందుకు ఘోరంగా ఉన్నదో అధీర్ రంజన్ చౌదరి స్పందించాలన్నారు.
 
బీజేపీపై కాంగ్రెస్ సమర్థంగా పోరాడలేకపోతోందని ఓవైసీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలను బీజేపీ ఎలా గెలుచుకోగలిగిందో వివరించాలని ఆయన కాంగ్రెస్ నాయకుడిని అడిగారు. బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments