Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృణమూల్ కాంగ్రెస్ శిబిరం‌లో అలారం మోగించడం ఖాయం.. ఓవైసీ

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (16:07 IST)
బీహార్‌లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఊపుమీదున్న ఎంఐఎం.. పశ్చిమ బెంగాల్‌లో కూడా పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ శిబిరంలో అలారం మోగించడం ఖాయమని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తామని ఒవైసీ ప్రకటించారు.
 
పశ్చిమ బెంగాల్ ఎంఐఎం నాయకులతో త్వరలో సమావేశమై చర్చిస్తానని, వారు తమ సంసిద్ధతను, విశ్వాసాన్ని చూపిస్తే.. తదుపరి పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో పోటీ చేయడంపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 'ఓటు కటువా'కు సమాధానమిచ్చిన ఓవైసీ.. మీ లోక్‌సభ నియోజకవర్గం బెర్హంపూర్‌లో ఎంత అభివృద్ధి పనులు చేశారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపీ ఆదిర్ రంజన్ చౌదరిని మందలించారు. 
 
తన లోక్‌సభ నియోజకవర్గంలో ముస్లిం సమాజం కోసం చేసిన అభివృద్ధి పనులపై చౌదరిని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో ముస్లింల పరిస్థితి ఎందుకు ఘోరంగా ఉన్నదో అధీర్ రంజన్ చౌదరి స్పందించాలన్నారు.
 
బీజేపీపై కాంగ్రెస్ సమర్థంగా పోరాడలేకపోతోందని ఓవైసీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలను బీజేపీ ఎలా గెలుచుకోగలిగిందో వివరించాలని ఆయన కాంగ్రెస్ నాయకుడిని అడిగారు. బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments