Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో కనీస మెజార్టీకి మూడు సీట్ల దూరంలో ఎన్డీయే కూటమి

ఠాగూర్
శుక్రవారం, 1 మార్చి 2024 (11:48 IST)
పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి సాధారణ మెజార్టీకి మూడు సీట్ల దూరంలో ఉంది. తాజాగా జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ 56 సీట్లకు గాను 30 స్థానాల్లో గెలుపొందింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం 97కి చేరింది. వంద సీట్లకు మరో మూడు స్థానాల దూరంలో ఆగిపోయింది. మరోవైపు, ఎన్డీయే కూటమి బలం 118 సీట్లకు పెరిగింది. 
 
మొత్తం 56 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 15 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాల్లోనూ బీజేపీ మరో రెండు స్థానాలను గెలుచుకోగలిగింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఇదే పనికి పాల్పడటంతో అక్కడ కూడా బీజేపీ మరో స్థానాన్ని అదనంగా కైవసం చేసుకుంది. 
 
కాగా, మొత్తం 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో సాధారణ మెజార్టీ 123 సీట్లు. అయితే, ప్రస్తుతం ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నాలుగు సీట్లు జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందినవి. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రపతి పాలన సాగుతుంది. మరో సీటు నామినేట్ విభాగంలో ఉంది. ఈ ఖాళీ ఐదు సీట్లను మినహాయిస్తే, ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్యా బలం 240కు తగ్గిపోయి కనీస మెజార్టీ కూడా 121కు పడిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీయే సాధారణ మెజార్టీ 118 సీట్లుగా ఉంది. అంటే సాధారణ మెజార్టీ 121కు మరో మూడు  సీట్ల దూరంలో ఆగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments