Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యం తారుమారు... ఆస్పత్రికి రూ.1.5 కోట్ల అపరాధం... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (13:41 IST)
కృత్రిమ గర్భధారణ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు తన భర్త వీర్యానికి బదులు మరో వ్యక్తి వీర్యం ఎక్కించిన ఆస్పత్రికి జాతీయ వినియోగదారుల ఫోరం భారీ అపరాధం విధించింది. ఈ కేసులో ఏకంగా రూ.1.5 కోట్ల ఫైన్ చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం షాక్‌కు గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాధిత జంట అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నిక్‌తో సంతాన భాగ్యం పొందేందుకు సదరు ఆస్పత్రిని ఆశ్రయించారు. ఫలితంగా వారికి 2009లో కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత శిశువులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆ పిల్లల తండ్రి మరొకరని తేలింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది చేసిన పొరపాటు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు న్యాయపోరాటానికి దిగారు. 
 
తమకు సదరు ఆస్పత్రి రూ.2 కోట్ల అపరాధం చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ కేసుపై కొన్నేళ్లపాటు సుధీర్ఘ విచారణ జరిగింది. చివరకు బాధితులకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. కృత్రిమ గర్భధారణ విధానాల సాయంతో జన్మించిన శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ తయారు చేసి ఇచ్చేనా నిబంధనలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిషన్ అభిప్రాయపడింది. అయితే ఈ పొరపాటు చేసిన ఆస్పత్రి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments