Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యం తారుమారు... ఆస్పత్రికి రూ.1.5 కోట్ల అపరాధం... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (13:41 IST)
కృత్రిమ గర్భధారణ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళకు తన భర్త వీర్యానికి బదులు మరో వ్యక్తి వీర్యం ఎక్కించిన ఆస్పత్రికి జాతీయ వినియోగదారుల ఫోరం భారీ అపరాధం విధించింది. ఈ కేసులో ఏకంగా రూ.1.5 కోట్ల ఫైన్ చెల్లించాలంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం షాక్‌కు గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాధిత జంట అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నిక్‌తో సంతాన భాగ్యం పొందేందుకు సదరు ఆస్పత్రిని ఆశ్రయించారు. ఫలితంగా వారికి 2009లో కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత శిశువులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆ పిల్లల తండ్రి మరొకరని తేలింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది చేసిన పొరపాటు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు న్యాయపోరాటానికి దిగారు. 
 
తమకు సదరు ఆస్పత్రి రూ.2 కోట్ల అపరాధం చెల్లించాలంటూ జాతీయ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ కేసుపై కొన్నేళ్లపాటు సుధీర్ఘ విచారణ జరిగింది. చివరకు బాధితులకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. కృత్రిమ గర్భధారణ విధానాల సాయంతో జన్మించిన శిశువు డీఎన్ఏ ప్రొఫైల్ తయారు చేసి ఇచ్చేనా నిబంధనలు రూపొందించాలని ఈ సందర్భంగా కమిషన్ అభిప్రాయపడింది. అయితే ఈ పొరపాటు చేసిన ఆస్పత్రి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments