Webdunia - Bharat's app for daily news and videos

Install App

నక్సల్ అంకుల్.. మా నాన్నని వదిలేయండి ప్లీజ్.. రాకేష్ సింగ్ కుమార్తె విజ్ఞప్తి (video)

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (20:56 IST)
CRPF Jawan Daughter
ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లను ట్రాప్ చేసి 400 మంది మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా దళాలపై విరుచుకుపడడంతో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కోబ్రా కమాండర్ రాకేష్ సింగ్ గల్లంతయ్యారు. అయితే ఆయన క్షేమంగా ఉన్నాడని.. తామే కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు మావోయిస్టులు స్థానిక విలేకరులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది.
 
జర్నలిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మావోయిస్టుల ఫోన్ కాల్స్‌ని పరిశీలిస్తున్నారు. నిజంగానే రాకేష్ సింగ్ ఆయన వద్ద ఉన్నారా? కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే రాకేష్ సింగ్‌ని కిడ్నాప్ చేశారని తెలియడంతో బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
తన తండ్రి నక్సల్స్ చెరలో బంధీగా ఉన్నాడని తెలిసి ఆయన చిన్నారి కూతురు ఏడుస్తూ మా నాన్నని వదిలేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మా నాన్నను వదిలిపెట్టండి.. అంకుల్ ప్లీజ్.. అంటూ చిన్నారి చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments