Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో కీలక పరిణామం... పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (16:08 IST)
పంజాబ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంగళవారం రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీలో చేరేందుకు హస్తినకు వెళ్లారన్న వార్తల నేపథ్యంలో సిద్ధూ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. 
 
నిజానికి వచ్చే యేడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. 
 
తాజాగా పంజాబ్ పీసీసీ చీఫ్ ప‌ద‌వికి న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి పంపించారు. 
 
పంజాబ్‌లో సిద్దూ వర్సెస్ కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌గా రాజకీయాలు సాగుతున్నాయి. సిద్దూతో దేశానికి ముప్పు ఉందని, అతనికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. 
 
అదేసమయంలో ఇపుడు ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో సిద్ధూ పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments