Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో గన్ కల్చర్.. టీవీ జర్నలిస్ట్‌పై దుండగుల కాల్పులు

ఢిల్లీలో గన్ కల్చర్ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ టీవీ జర్నలిస్ట్‌పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలై

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (16:29 IST)
ఢిల్లీలో గన్ కల్చర్ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ టీవీ జర్నలిస్ట్‌పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన జర్నలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ''సహారా సమయ్''‌ అనే న్యూస్‌ ఛానల్‌లో అనుజ్‌ చౌదరీ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనాలపై వచ్చి అనుజ్‌ ఇంట్లోకి అడుగెట్టారు. ఆపై కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పుల్లో బాధితుడి పొట్ట.. కుడిచేతిలో బుల్లెట్లు దిగాయి. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అనుజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. 
 
బీఎస్పీ కౌన్సిలర్ భర్త జర్నలిస్ట్ అనూజ్‌ చౌదరీ కావడంతో వ్యక్తిగత కక్షలతోనే ఈ దాడి జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో వున్న దుండగుల కోసం నాలుగు పోలీసు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments