Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానం ల్యాండ్ అవుతుంటే నాలుగు టైర్లూ పేలిపోయాయి... తర్వాత?

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ల్యాండ్ అవుతుండగా దాని టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులంతా బిగ్గరగా కేకలు వేస్తూ బెంబేలెత్తిపోయారు.

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (15:34 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ల్యాండ్ అవుతుండగా దాని టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులంతా బిగ్గరగా కేకలు వేస్తూ బెంబేలెత్తిపోయారు. శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీ నుంచి జమ్ము మీదుగా శ్రీనగర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా (ఏఐ) 821 విమానం జమ్ము విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. 
 
ఈ విమానం రన్ వేపై ల్యాండ్ అవుతుండగా విమానం టైర్లు పంక్చర్ అయ్యాయి. పెద్ద శబ్దం చేస్తూ నాలుగు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో విమానం ఒక్కసారిగా భారీ కుదుపునకులోనైంది. ఉన్నట్టుండి ఇలా జరగడంతో అందులోని ప్రయాణికులంతా హడలిపోయారు. అయితే పైలట్ విమానాన్ని అద్భుతంగా నియంత్రించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 
 
కాగా, శుక్రవారం మధ్యాహ్నం 11.05 గంటలకు ఢిల్లీలో బయలుదేరిన ఈ విమానం 12.20 నిమిషాలకు జమ్మూకు చేరుకుంది. ఆ సమయంలోనే ఈ విమానం టైర్లు పేలిపోయాయి. పిమ్మట టైర్లు మార్చాక జమ్మూ ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.45 గంటలకు శ్రీనగర్‌కు చేరుకుంది. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments