Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఇంట్లో దేవాన్ష్ ఏడ్చినా.. జగన్ తొడబెల్లం పెట్టివుంటారని అంటారు : ఆర్కే.రోజా

రాష్ట్రమంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఏడ్చినా... విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తొడబెల్లం పెట్టివుంటాడని, అందుకే ఏడ్చాడని టీడీపీ నేతలు అంటారని వైకాపా ఎమ్మెల్య

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (14:14 IST)
రాష్ట్రమంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఏడ్చినా... విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తొడబెల్లం పెట్టివుంటాడని, అందుకే ఏడ్చాడని టీడీపీ నేతలు అంటారని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఎద్దేవా చేశారు. 
 
అసెంబ్లీలోని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి ఛాంబ‌ర్‌లోకి వ‌ర్ష‌పు నీళ్లు రావ‌డంపై ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా త‌మ పార్టీ అధినేత‌పై కుట్ర జరుగుతోందన్నారు. టీడీపీ నేతల ప‌థ‌కం ప్ర‌కార‌మే జ‌గ‌న్‌ ఛాంబర్‌లో లీకేజీ వ్యవహారం జ‌రిగింద‌న్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ జగన్‌పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు.
 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏ చిన్నపాటి సంఘటన జరిగినా అది జ‌గ‌న్ వ‌ల్లే జరిగిందంటూ టీడీపీ నేత‌లు గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకవేళ‌ చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్‌ ఏడ్చినప్ప‌టికీ జగనే గిచ్చి ఉంటార‌ని అంటారేమో? అని ఆమె ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ ఛాంబ‌ర్‌లో లీకేజీపై సీబీఐతో విచారణ జ‌రిపించాల‌ని రోజా డిమాండ్ చేశారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments