చెల్లితో అక్రమం సంబంధం : వ్యక్తిని హతమార్చిన సోదరులు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:00 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. పెళ్లీడుకొచ్చిన తమ చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అక్కసుతో ఇద్దరు సోదరులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాగపూర్ నగరంలోని కపిల్ నగర్ గడ్డిగోడం ప్రాంతానికి చెందిన కమలేష్ బందు సహారే అనే వ్యక్తికి వివాహమైంది. కానీ, ఆయన్ను భార్య వదిలేసింది. దీంతో కమలేష్ కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో మహదా కాలనీలోని టీనేజ్ యువతితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమం సంబంధానికి దారితీసింది. తనతో పలికే అమ్మాయికి కమలేష్ మొబైల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చాడు. తల్లిదండ్రులు వివాహితుడితో సంబంధం పెట్టుకోవడం తెలిసి మందలించారు. 
 
ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా కమలేశ్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. రెండు వారాల పాటు జైలులో ఉన్న కమలేశ్ విడుదలై, ఆ యువతితో మాట్లాడసాగాడు. 
 
దీంతో ఆగ్రహించిన బాలిక సోదరులిద్దరూ వారి స్నేహితులతో కలిసి కమలేశ్‌ను పట్టుకొని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు బాలిక సోదరులపై ఐపీసీ సెక్షన్ 302, 34 ప్రకారం కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments