Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లితో అక్రమం సంబంధం : వ్యక్తిని హతమార్చిన సోదరులు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:00 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. పెళ్లీడుకొచ్చిన తమ చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అక్కసుతో ఇద్దరు సోదరులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాగపూర్ నగరంలోని కపిల్ నగర్ గడ్డిగోడం ప్రాంతానికి చెందిన కమలేష్ బందు సహారే అనే వ్యక్తికి వివాహమైంది. కానీ, ఆయన్ను భార్య వదిలేసింది. దీంతో కమలేష్ కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో మహదా కాలనీలోని టీనేజ్ యువతితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమం సంబంధానికి దారితీసింది. తనతో పలికే అమ్మాయికి కమలేష్ మొబైల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చాడు. తల్లిదండ్రులు వివాహితుడితో సంబంధం పెట్టుకోవడం తెలిసి మందలించారు. 
 
ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా కమలేశ్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. రెండు వారాల పాటు జైలులో ఉన్న కమలేశ్ విడుదలై, ఆ యువతితో మాట్లాడసాగాడు. 
 
దీంతో ఆగ్రహించిన బాలిక సోదరులిద్దరూ వారి స్నేహితులతో కలిసి కమలేశ్‌ను పట్టుకొని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు బాలిక సోదరులపై ఐపీసీ సెక్షన్ 302, 34 ప్రకారం కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments