Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు గర్భిణి.. కిడ్నాప్ చేసి మెడపై కత్తి పెట్టి.. సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 8 జులై 2020 (22:08 IST)
నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా కామాంధుల్లో మార్పు రాలేదు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా నాగపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గర్భిణిపై కామాంధులు అకృత్యానికి పాల్పడ్డారు. 
 
ఓ మహిళ నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నాగపూర్ పట్టణంలో ఓ నిండు గర్భిణీ పై ముగ్గురు వ్యక్తులు పైశాచిక దాడికి పాల్పడ్డారు. మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మను ఇవ్వాల్సిన మహిళపై దారుణానికి ఒడిగట్టారు.
 
సదరు ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి ఓ బిల్డింగ్ టెర్రస్ పైకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో మహిళ మెడపై కత్తి పెట్టి మరి దారుణానికి ఒడిగట్టారు. 
 
ఈ సంఘటన అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments