Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ప్లీనరీలో సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా...

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (16:17 IST)
కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభలు ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ సభలు మూడు రోజుల పాటు జరుగుతాయి. 
 
రెండో రోజు శనివారం ఈ సభలకు ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాక గాంధీ వాద్రాతో పాటు అగ్ర నేతలు పాల్గొన్నారు. రెండోరోజు మహాసభల్లో సోనియాగాంధీ మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు, దేశానికి సవాలుతో కూడిన సమయం ఇదన్నారు. 
 
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మంచి ప్రభుత్వాన్ని ఇచ్చామని గుర్తు చేశారు. బీజేపీ హయాంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలు ఆర్ఎస్ఎస్- బీజేపీ నియంత్రణలో వున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
దళితులు, మైనార్టీలు, మహిళలు చిత్రహింసలకు గురవుతున్నారని, కొందరు పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సోనియా విమర్శించారు.
 
తన రాజకీయ ఇన్నింగ్స్‌కు ముగింపు పలకనున్నట్లు సోనియా చెప్పారు. తన రాజకీయ జీవితం భారత్ జోడో యాత్రతో ముగుస్తుండటం ఎంతో సంతోషంగా వుందని సోనియా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments