Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉత్పల్ పారికర్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (12:14 IST)
గోవా అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. దీంతో ఈ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారీకర్‌ తనయుడు ఉత్పల్ మనోహర్‌కు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పనాజీ నుంచి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, తనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వనందుకే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినట్టు చెప్పారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటికీ భాజపాలో మాత్రం చేరబోనని స్పష్టం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో తన పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, టీఎంసీలపై కాదని ఒక్క బీజేపీపైనే అని చెప్పారు. కాగా, ఆయన పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకుముందు ఆయన నామినేషన్ దాఖలు చేసే ముందు మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
తన తండ్రి పోటీ చేసి గెలిచిన పనాజీ నుంచి పోటీ చేసి గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని భావించాను. కానీ, కమలనాథులు తనకు టిక్కెట్ నిరాకరించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ మాజీ నేత అటానాసియో బాబూష్‌కు మాన్ సెరాటేకు టిక్కెట్ కేటాయించింది. పార్టీ నమ్ముకున్న వారికంటే వలస వచ్చినవారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments