Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉత్పల్ పారికర్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (12:14 IST)
గోవా అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. దీంతో ఈ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారీకర్‌ తనయుడు ఉత్పల్ మనోహర్‌కు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పనాజీ నుంచి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, తనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వనందుకే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినట్టు చెప్పారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటికీ భాజపాలో మాత్రం చేరబోనని స్పష్టం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో తన పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, టీఎంసీలపై కాదని ఒక్క బీజేపీపైనే అని చెప్పారు. కాగా, ఆయన పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకుముందు ఆయన నామినేషన్ దాఖలు చేసే ముందు మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
తన తండ్రి పోటీ చేసి గెలిచిన పనాజీ నుంచి పోటీ చేసి గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని భావించాను. కానీ, కమలనాథులు తనకు టిక్కెట్ నిరాకరించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ మాజీ నేత అటానాసియో బాబూష్‌కు మాన్ సెరాటేకు టిక్కెట్ కేటాయించింది. పార్టీ నమ్ముకున్న వారికంటే వలస వచ్చినవారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments