Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలోకి వెళ్లాడని చావకొట్టారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (10:11 IST)
మంచినీరు తాగేందుకు ఆలయంలోకి ప్రవేశించాడన్న కారణంతో ముస్లిం బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసి చావకొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. 

ఆ వీడియోలో బాలుడిని ఒక వ్యక్తి ఏమాత్రం దయలేకుండా చితకబాదడం కనిపించింది. 'నీ పేరు ఏంటి.. నీ తండ్రి పేరు ఏంటి?' అని అడగ్గా ఆ బాలుడు చెప్పిన సమాధానంతో అతను ముస్లిం అని తెలుస్తోంది. ఆలయంలోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించగా.. మంచి నీరు తాగేందుకు వచ్చానని ఆ బాలుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది.

ఆ తరువాత బాలుడిని కొట్టడం ప్రారంభించిన వ్యక్తి.. చేయి మెలితిప్పడంతో పాటు పలుమార్లు బాలుడి తలపై తన్నాడు. కింద పడినా కొట్టడం ఆపలేదు.

బాలుడిని కొట్టిన వ్యక్తిని బీహార్‌లోని భగల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన శ్రింగి నందన్‌ యాదవ్‌గా గుర్తించి, అరెస్టు చేసినట్లు ఘజియాబాద్‌ పోలీసులు తెలిపారు. నిరుద్యోగి అయిన నిందితుడు మూడు నెలలుగా ఆలయంలోనే నివాసం ఉంటున్నాడని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments