Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ అంబానీకి బెదిరింపులు - ఒకరి అరెస్టు

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (16:21 IST)
భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. 
 
కాగా, ప్రాణహాని తలపెడతామంటూ అంబానీకి, ఆయన కుటుంబానికి ఒకే రోజు ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబరుకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. 
 
మొత్తం ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని డీబీ మార్గ్ పోలీస్ స్టేషనులో రిలయన్స్ ఫౌండేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఒకేరోజు ఎనిమిది కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ... రిలయన్స్ ఫౌండేషన్ నుంచి ఫిర్యాదు అందిందని చెప్పారు. మరోవైపు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ముంబై వెస్ట్ సబర్బ్ ప్రాంతంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ముఖేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో నింపిన స్కార్పియో వాహనం పార్క్ చేసి ఉండటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ కారు యజమాని కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments