Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

ఐవీఆర్
మంగళవారం, 19 ఆగస్టు 2025 (14:03 IST)
దేశాన్ని రుతుపవనాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర అత్యంత దెబ్బతింది. గత 24 గంటల్లో అనేక ప్రాంతాలలో 200 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. తూర్పు శివారు ప్రాంతాలలోని విఖ్రోలిలో అత్యధికంగా 255.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ముంబై మహా నగర రోడ్లు జలమయం అయ్యాయి.
 
అన్ని ప్రధాన కూడళ్లు చెరువులను తలపిస్తున్నాయి. రూ. 15 కోట్లు నుంచి రూ. 20 కోట్లు పెట్టి దక్షిణ ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో కొనుగోలు చేసిన ఫ్లాట్స్ వద్ద తొడల లోతు నీళ్లు చేరాయి. ఖరీదైన కార్లు నీళ్లలో పడవల్లా తేలాడుతున్నాయి. బోరివలి, అంధేరి, సియోన్, దాదర్, చెంబూర్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో రాత్రంతా భారీ వర్షం కురిసింది. ఉదయం కూడా వర్షం కొనసాగింది, ఫలితంగా గాంధీ మార్కెట్‌తో సహా లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది.
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మంగళవారం నాడు కూడా మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రెడ్ అలర్ట్ హెచ్చరిక దృష్ట్యా ముంబైలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments