Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దంచికొడుతున్న వర్షాలు - రైల్వే స్టేషన్‌లలోకి నీరు

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (16:40 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఉదయం వరకూ కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధానిలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. 
 
సియోన్ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. నడుములోతు నీటిలో వాహనాలు నడపడం సాధ్యపడడం లేదు. ముఖ్యంగా రత్నగిరి జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. నవీ ముంబైలోని ఖందేశ్వర్‌ రైల్వేస్టేషన్‌ జలమయమైంది. మోకాళ్లులోతు వరకు నీళ్లు చేరాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. 
 
అంధేరి ప్రాంతంలోనూ భారీ వర్షానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. సబర్బన్ రైళ్లన్నీ సాధారణంగానే తిరుగుతున్నా.. రోడ్లపై వరద నీరు చేరడం వల్ల... పలు బస్సులను దారిమళ్లించారు. 
 
ముంబై పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఇదివరకే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర సర్కార్‌ ఎన్​డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments