Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న పిల్లని మంటల్లో వేసిన రాక్షసుడు...

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:43 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రాక్షసుడుగా మారిపోయాడు. హాయిగా నిద్రిస్తున్న పిల్లిని నిప్పుల్లో వేసి రాక్షసానందం పొందాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని భారతీ పార్క్ సమీపంలో ఉన్న నయా నగర్‌కు చెందిన సిద్ధేశ్ పటేల్ అనే వ్యక్తి.. సోమవారం అర్థరాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. 
 
ఆ సమయంలో మెట్ల కింద కొన్ని పిల్లులు హాయిగా నిద్రిస్తున్నాయి. వాటిని చూడగానే ఈ రాక్షసుడుకి ఓ వింత ఆలోచన మొదలైంది. దీంతో వాటిని ఓ బాక్సులో వేసి నిప్పు పెట్టాడు. మంటలకు తాళలేక పరిగెడుతుంటే మళ్లీ వాటిని పట్టుకుని మంటల్లో వేశాడు. కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంటల్లో కాలిపోతుంటే వికృతానందం పొందాడు. 
 
అతను అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికి అపార్ట్‌మెంట్ వాసులు ఈ దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ చర్యను జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments