Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను ముద్దాడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు.. వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (16:59 IST)
మహిళలపై వావివరుసలు, వయోబేధాలు లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. నిర్భయ లాంటి చట్టాలొచ్చినా.. కామాంధుల ఆగడాలు తగ్గట్లేదు. లాక్ డౌన్‌లోనూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న వ్యక్తికి జైలు ఖాయమైంది. 
 
మైనర్ బాలికను ముద్దాడిన కేసులో ఓ వ్యక్తి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో మైనర్ పిల్లల రక్షణ కోసం ఉద్దేశించిన పోక్సో చట్టం కింద వచ్చిన తొలితీర్పు ఇదే కావడం గమనార్హం. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన అబు అబ్దుల్‌ రెహ్మాన్‌ అనే 30 ఏళ్ల వ్యక్తి.. 2018 జూన్‌ 29న అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అతడ్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
 
బుధవారం ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును ముంబై స్థానిక కోర్టు వెలువరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. మైనర్‌ బాలిక తనను ముద్దు పెట్టుకుంది అతనే అంటూ కోర్టులో అబ్దుల్‌ను గుర్తు పట్టింది. దీంతో అతడ్ని దోషిగా తేల్చిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments