కన్నతండ్రే కన్నబిడ్డను తల్లిని చేశాడు.. 25ఏళ్ల జైలుశిక్ష

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (22:19 IST)
కన్నతండ్రే కన్నబిడ్డను తల్లిని చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మైనర్ కూతురిపై కొన్ని నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు తండ్రి. బెదిరింపులకు గురి చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ క్రమంలో బాలిక శరీరంలో శారీరక మార్పులు గ్రహించిన ఆమె బామ్మ నిలదీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం గతేడాదే జరిగింది. తాజాగా కోర్టు అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన భార్య పిల్లలు, తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. అతను తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజు ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. భర్త వేధింపులతో భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. 
 
అయితే నిందితుడి తల్లి తన పెన్షన్ డబ్బులతో మనవరాలిని ,మనవడిని చూసుకునేది. కొడుకు ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఇంతలో మనవరాలి శరీరంలో మార్పులు గమనించింది. 
 
బాలికను నిలదీస్తే భయంతో తన తండ్రి ప్రతిరోజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో బాధితుడి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ బాలిక పోలీసులకు మాత్రం తండ్రిపై ఫిర్యాదు చేయలేదు. 
 
ఈ కేసును విచారించిన కోర్టు బాలిక పట్ల అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తేల్చింది . నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది కోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments