Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై రైల్వే స్టేషన్.. ఫ్లాట్‌ఫామ్‌లోనే కాన్పు.. పోలీసులు ఏం చేశారంటే?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (14:27 IST)
ముంబై రైల్వే స్టేషన్‌లోనే ఓ మహిళ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పోలీసులే ఆ మహిళ కోసం లేబర్ రూమ్ సిద్ధం చేశారు. ఎలాగంటే..? 21 ఏళ్ల మహిళ ఎప్పుడూ బిజీ బిజీగా ముంబై రైల్వేస్టేషన్‌లో క్రిస్మస్‌కు ముందు రోజు డిసెంబర్ 24వ తేదీన పండంటి పాపకు జన్మనిచ్చింది. గీత దీపక్ వాఘ్రే ఆమె భర్త దాదర్ స్టేషన్‌లో పూణే వెళ్లేందుకు గాను వేచి వున్నారు. ఆ సమయంలో గీతకు పురిటి నొప్పులు వచ్చాయి. 
 
ఇక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. వెంటనే అక్కడున్న పోలీసులు.. ప్రయాణీకులు బెడ్ షీట్లతో లేబర్ రూమ్‌లా నాలుగు వైపులా అడ్డుకట్టారు. భార్య వద్దే భర్త కూర్చుండి పోయాడు. కొందరు మహిళలు గీతకు ఫ్లాట్‌ఫామ్‌లోనే ప్రసవం చూశారు. 
 
ఈ క్రమంలో గీతకు పండంటి పాప పుట్టింది. కాన్పు జరగగానే పోలీసులు మహిళను, శిశువును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా వున్నారని పోలీసులు తెలిపారు. ఇదే విధంగా ఈ ఏడాది సెప్టెంబరులో 27 ఏళ్ల మహిళ భుసవాల్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్‌లోనే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 30 ఏళ్ల మహిళ జూలైలో ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో కవల పిల్లలకు రైలులోనే జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments