Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు.. బిట్ కాయిన్లలో డబ్బు కావాలంటా డెడ్‌లైన్

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:13 IST)
అత్యంత రద్దీగా ఉండే దేశ వాణిజ్య రాజధాని ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టు ఫీడ్ బ్యాక్ ఇన్‌బాక్స్‌కు ఈ ఈమెయిల్‌ను అగంతకులు పంపించారు. ఇందులో తమకు బిట్ కాయిన్ రూపంలో నగదు చెల్లించాలంటూ ఇందుకోసం 48 గంటల పాటు డెడ్‌లైన్ విధిస్తున్నామని అందులో పేర్కొంది. పైగా, తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2ను పేల్చివేస్తామని ఆ అగంతకులు హెచ్చరించారు. 
 
తాము విధించిన గడువులోగా డబ్బు చెల్లించకపోతే మరో మెయిల్ పంపుతామని, ఆ తర్వాత కూడా తమ డిమాండ్ నెరవేర్చకపోతే టెర్మినల్-2ను పేల్చివేస్తామని హెచ్చరించారు. ఈమెయిల్ బెదిరింపుపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి కూడా ఇటీవల ఇదే తరహా బెదిరింపు వచ్చిన విషయం తెల్సిందే. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకపోతే హత్య చేస్తామంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆతర్వాత రూ.200 కోట్లు, రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన 19 యేళ్ల యువకుడిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments