Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు.. బిట్ కాయిన్లలో డబ్బు కావాలంటా డెడ్‌లైన్

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:13 IST)
అత్యంత రద్దీగా ఉండే దేశ వాణిజ్య రాజధాని ముంబై ఎయిర్‌పోర్టుకు ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. ఎయిర్‌పోర్టు ఫీడ్ బ్యాక్ ఇన్‌బాక్స్‌కు ఈ ఈమెయిల్‌ను అగంతకులు పంపించారు. ఇందులో తమకు బిట్ కాయిన్ రూపంలో నగదు చెల్లించాలంటూ ఇందుకోసం 48 గంటల పాటు డెడ్‌లైన్ విధిస్తున్నామని అందులో పేర్కొంది. పైగా, తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2ను పేల్చివేస్తామని ఆ అగంతకులు హెచ్చరించారు. 
 
తాము విధించిన గడువులోగా డబ్బు చెల్లించకపోతే మరో మెయిల్ పంపుతామని, ఆ తర్వాత కూడా తమ డిమాండ్ నెరవేర్చకపోతే టెర్మినల్-2ను పేల్చివేస్తామని హెచ్చరించారు. ఈమెయిల్ బెదిరింపుపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి కూడా ఇటీవల ఇదే తరహా బెదిరింపు వచ్చిన విషయం తెల్సిందే. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకపోతే హత్య చేస్తామంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆతర్వాత రూ.200 కోట్లు, రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన 19 యేళ్ల యువకుడిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments