అసాం కామాఖ్యదేవీ ఆలయానికి ముఖేష్ అంబానీ దంపతులు 19 కిలోల బంగారం భారీ విరాళం

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (16:34 IST)
అసాం లోని కామాఖ్యదేవి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. తాజాగా ఈ ఆలయానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రముఖ రిలయన్స్ అధినేత, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ దంపతులు భారీగా బంగారం విరాళంగా ఇచ్చారు. ఆలయగోపుర కలశాల తయారీ కోసం 19 కిలోల బంగారాన్ని ఇచ్చారు. ఈ బంగారంతో మూడు గోపుర కలశాలు రూపొందిస్తున్నట్లు కామాఖ్య ఆలయ వర్గాలు తెలిపాయి.
 
ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితమే బంగారం విరాళంగా ఇచ్చేందుకు అంబానీ దంపతులు కామాఖ్య ఆలయ వర్గాలకు సమాచారం అందించారు. అవే కాకుండా మూడు కలశాల బంగారు తాపడం ఖర్చులు కూడా తేమే భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరపున బంగారం అందించగా కలశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
 
ఈ నిర్మాణ కార్యక్రమంలో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేష్ అంబానీ వారి భార్య నీతా అంబానీ అస్సాంలో కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శనించనున్నా రు. దేశంలో గల శక్తి పీఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కామాఖ్య ఆలయం అస్సాంలోని నీలాచల కొండల్లో కొలువై ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుండి భక్తులు తరలి వస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments