Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనీస ధరపై తక్షణం చట్టం చేయలేం : కేంద్ర మంత్రి అర్జున్ ముండా

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (20:31 IST)
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతన్నలు మంగళవారం చేపట్టిన ఢిల్లీ ఛలో ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి ఢిల్లీ ట్రాక్టర్లతో బయల్దేరిన అన్నదాతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతుల నిరసనపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్‌పీపై తక్షణమే చట్టం తీసుకురాలేమన్నారు. దీనిపై రైతు సంఘాలు చర్చలకు రావాలని కోరారు.
 
'కొన్ని శక్తులు (విపక్షాలను ఉద్దేశిస్తూ) తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళనను ఉపయోగించుకుంటున్నాయి. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. కనీస మద్దతు ధరపై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేం. దీనిపై అన్ని వర్గాల వారితో సుదీర్ఘ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకే, రైతు సంఘాలు ఆందోళన విరమించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చల కోసం రావాలి' అని అర్జున్‌ ముండా సూచించారు.
 
ఈ ఆందోళన అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్‌కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్‌సింగ్‌ డల్లేవాల్‌, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్‌ పంధేర్‌ తదితరులతో సోమవారం చర్చలు జరిపింది. రైతులు చేసిన డిమాండ్లలో కొన్నింటికి మంత్రుల బృందం అంగీకారం తెలపగా.. ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు.
 
మరోవైపు, రైతుల ఆందోళన విషయంలో భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అన్నదాతల నిరసనను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో కనీస మద్దతు ధర చట్టబద్ధతపై హామీ ఇచ్చింది. 'రైతు సోదరులారా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం ప్రతి రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇది 15 కోట్ల రైతు కుటుంబాల జీవితాలను మారుస్తుంది. న్యాయం కోసం మేం ఎంచుకున్న మార్గంలో ఇదే మా తొలి గ్యారెంటీ. #KisaanNYAYGuarantee' అని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments