Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనీస ధరపై తక్షణం చట్టం చేయలేం : కేంద్ర మంత్రి అర్జున్ ముండా

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (20:31 IST)
పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతన్నలు మంగళవారం చేపట్టిన ఢిల్లీ ఛలో ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి ఢిల్లీ ట్రాక్టర్లతో బయల్దేరిన అన్నదాతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతుల నిరసనపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్‌పీపై తక్షణమే చట్టం తీసుకురాలేమన్నారు. దీనిపై రైతు సంఘాలు చర్చలకు రావాలని కోరారు.
 
'కొన్ని శక్తులు (విపక్షాలను ఉద్దేశిస్తూ) తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళనను ఉపయోగించుకుంటున్నాయి. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. కనీస మద్దతు ధరపై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేం. దీనిపై అన్ని వర్గాల వారితో సుదీర్ఘ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకే, రైతు సంఘాలు ఆందోళన విరమించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చల కోసం రావాలి' అని అర్జున్‌ ముండా సూచించారు.
 
ఈ ఆందోళన అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్‌కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్‌సింగ్‌ డల్లేవాల్‌, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్‌ పంధేర్‌ తదితరులతో సోమవారం చర్చలు జరిపింది. రైతులు చేసిన డిమాండ్లలో కొన్నింటికి మంత్రుల బృందం అంగీకారం తెలపగా.. ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు.
 
మరోవైపు, రైతుల ఆందోళన విషయంలో భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అన్నదాతల నిరసనను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో కనీస మద్దతు ధర చట్టబద్ధతపై హామీ ఇచ్చింది. 'రైతు సోదరులారా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం ప్రతి రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇది 15 కోట్ల రైతు కుటుంబాల జీవితాలను మారుస్తుంది. న్యాయం కోసం మేం ఎంచుకున్న మార్గంలో ఇదే మా తొలి గ్యారెంటీ. #KisaanNYAYGuarantee' అని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments