Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్వాలియర్‌లో దారుణ ఘటన.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 27 జులై 2022 (16:12 IST)
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై కన్నేసిన ట్యూటర్ ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీడియో, ఫొటోలు చిత్రీకరించిన కామాంధుడు.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై సంవత్సరం నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
 
బాధితురాలు 9వ తరగతి చదువుతోంది. నిందితుడు ఆమెకు ట్యూషన్ క్లాసులు చెప్పేందుకు రోజూ ఇంటికి వచ్చేవాడు. కొన్నిసార్లు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ సమయంలో వీడియోలు, చిత్రాలను కూడా తీసినట్లు పోలీసులు తెలిపారు.
 
తాను చెప్పినట్లు వినకపోతే ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని నిందితుడు బాలికను బెదిరించేవాడు. ఆమె భయంతో చాలాకాలం పాటు మౌనంగా ఉంది. అయితే.. వీడియోల గురించి బయటకు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై వేధింపులకు పాల్పడుతూ వీడియోలు, చిత్రాల తీసినట్లు బాధితురాలు కుటుంబసభ్యులకు వివరించింది.
 
నిందితుడు కొన్ని సందర్భాల్లో తన ఇంటికి పిలిపించుకుని ఆమెపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చదువుకునే సమయంలో పిల్లల వల్ల ఇబ్బంది కలుగుతుందనే సాకుతో తరచూ గదికి తాళం వేసి, బాధితురాలిని హింసించే వాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం