Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్మెంట్ సొమ్మును పేద విద్యార్థుల చదువుకు దానం చేసిన ఉపాధ్యాయుడు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు 39 యేళ్లపాటు ఉద్యోగం చేసి పదవీ విరమణ ద్వారా వచ్చిన డబ్బునంతా పేద విద్యార్థుల చదువుకే ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఆశ్చర్యకర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ రాష్ట్రంలోని పన్నా జిల్లా, ఖాందియాకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి 39 యేళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 
 
ఇటీవలే ఆయన పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన చేసిన సర్వీసుకు రూ.40 లక్షల మేరకు సొమ్ము వచ్చింది. ఈ సొమ్మును ఆయన పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదీ కూడా తన భార్యాపిల్లల నిర్ణయం మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
 
 
 
తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని బాధలన్నింటినీ మనం తగ్గించలేమన్నారు. కానీ, మనం చేయాల్సిన కాసింత మంచినైనా చేద్దామన్నారు. తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నానని, చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఆ కష్టం రాకూడదనే తన సర్వీసు కాలంలో సంపాదించిన, పొదుపు చేసిన సమ్మును పేద విద్యార్థుల విద్యకే ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments