రిటైర్మెంట్ సొమ్మును పేద విద్యార్థుల చదువుకు దానం చేసిన ఉపాధ్యాయుడు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు 39 యేళ్లపాటు ఉద్యోగం చేసి పదవీ విరమణ ద్వారా వచ్చిన డబ్బునంతా పేద విద్యార్థుల చదువుకే ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఆశ్చర్యకర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ రాష్ట్రంలోని పన్నా జిల్లా, ఖాందియాకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి 39 యేళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 
 
ఇటీవలే ఆయన పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన చేసిన సర్వీసుకు రూ.40 లక్షల మేరకు సొమ్ము వచ్చింది. ఈ సొమ్మును ఆయన పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదీ కూడా తన భార్యాపిల్లల నిర్ణయం మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
 
 
 
తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని బాధలన్నింటినీ మనం తగ్గించలేమన్నారు. కానీ, మనం చేయాల్సిన కాసింత మంచినైనా చేద్దామన్నారు. తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నానని, చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఆ కష్టం రాకూడదనే తన సర్వీసు కాలంలో సంపాదించిన, పొదుపు చేసిన సమ్మును పేద విద్యార్థుల విద్యకే ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments